తాజాగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ నటిస్తున్న చిత్రం “గుణ 369”. ఈ చిత్రంలో కార్తికేయ సరసన అనగ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని తిరుమల రెడ్డి, అనీల్ కడియాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి. చింతన్ భరద్వాజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా పని చేస్తున్నారు. ఇక చిత్ర టీజర్ని జూన్ 17న విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రస్టిక్ లవ్ స్టోరీగా ఉండనున్న ఈ చిత్రం ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుందనే నమ్మకంతో ఉన్నారు చిత్రబృందం. అర్జున్ జంధ్యాలకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ ట్రైలర్ లో లవ్, యాక్షన్, ఎమోషన్స్ సీన్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. మనిషి రూపం వేరు..నిజస్వరూపం వేరు అని కార్తికేయ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శీను చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
previous post