telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పట్టు వీడని శివసేన.. బీజేపీ హోటల్ రాజకీయాలు .. ఇది తేలేదెన్నటికో…

bjp-sivasena set with seats in maharastra

మహారాష్ట్ర రాజకీయాలు బీజేపీ, శివసేన తమ పట్టు వీడకపోవటం, కాంగ్రెస్, ఎన్.సి.పి శివసేనతో కలవటానికి వెనకడుగు వేయటంతో మరింత వేడెక్కాయి. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందంటూ శివసేన అందర్నీ హోటల్ కు తరలించింది. దీనితో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. అసెంబ్లీ గడువు 9వ తేదీతో ముగియనుండటంతో పార్టీలు చకచకా పావులు కదుపుతున్నాయి. ఓ వైపు గవర్నర్‌ను కలిసేందుకు బీజేపీ సిద్ధమవుతున్న వేళ.. తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా శివసేన జాగ్రత్త పడుతోంది. వారిని ముంబయిలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు తరలించేందుకు గదులు సిద్ధం చేసినట్టు సమాచారం. అలాంటిదేమీ లేదని శివసేన తోసిపుచ్చుతోంది.

శివసేన మాత్రం ముఖ్యమంత్రి పదవిపై పట్టువీడటం లేదు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఏకంగా హోటల్‌ కు తరలించింది. తమ ఎమ్మెల్యేలెవరూ కట్టుదాటకుండా జగ్రత్త పడుతోంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీకి సమీపంలోని హోటల్‌ కు ఎమ్మెల్యేలను తరలించారు. మహారాష్ట్రలో అసెంబ్లీ గడువు ముగియడానికి సరిగ్గా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో శివసేన ఈ నిర్ణయం తీసుకుంది.

Related posts