టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా లోకేశ్ కు బుద్ధి రాలేదని ఆయన అన్నారు. నాలుగు పదాలను కూడా సరిగా పలకలేని లోకేశ్, జగన్, విజయసాయిరెడ్డిల గురించి మట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.
ప్రెస్ మీట్ పెట్టి మంగళగిరి, డెంగ్యూ, గుంటూరు పదాలను పలకాలని సవాల్ విసిరారు. పదవుల కోసం టీడీపీ నేతలు ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు.పాములు బయటకొచ్చాయని లోకేశ్ చెప్పిన మాట నిజమేనని, గత ఐదేళ్లలో చాలా పాములు బయటకు వచ్చాయని… వాటిని ప్రజలు చావగొట్టారని సుధాకర్ బాబు అన్నారు. కేవలం 23 పాములు మాత్రమే తప్పించుకున్నాయని ఎద్దేవాచేశారు.