కర్ణాటక మంత్రుల రాజీనామాల పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు భారీ స్ధాయిలో డబ్బుతో పాటు మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.ఇంత పెద్ద మొత్తంలో డబ్బు బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చిందని సిద్ధరామయ్య ప్రశ్నించారు.
రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరేందుకు సీఎల్పీలో నిర్ణయించామని తెలిపారు. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ అప్రజాస్వామిక పద్ధతిలో కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలో మద్ధతు లేని కారణంగానే యడ్యూరప్ప కేవలం మూడు రోజుల్లోనే సీఎం పీఠాన్ని వదులుకోవాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు.