చెన్నై వేదికగా ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-కోల్కత నైట్ రైడర్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టులో ఓపెనర్ నితీష్ రానా(80), రాహుల్ త్రిపాఠి(53) అర్ధశతకాలతో రెచ్చిపోయారు. ఆ తర్వాత చివర్లో దినేష్ కార్తీక్ 9 బంతుల్లో 22 పరుగులతో కొన్ని మెరుపులు మెరిపించడంతో నైట్ రైడర్స్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన సన్రైజర్స్ కు మొదట్లోనే షాక్ తగ్గిలింది. ఇద్దరు ఓపెనర్లు వరుస ఓవర్లలో పెవిలియన్ కు చేరిన తర్వాత మూడో మూడో వికెట్ కు 92 పరుగుల భాగసౌమ్యం నెలకొల్పారు. హాఫ్ సెంచరీ చేసిన బెయిర్స్టో ఔట్ కావడంతో మళ్ళీ కష్టాలో పడిపోయింది జట్టు. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే చేయడంతో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో మొదటి మ్యాచ్ లో విజయం సాధించిన కేకేఆర్ తమ పాయింట్ల ఖాతాను తెరిచింది.
previous post
next post