కొత్త జర్సీ లో భారత ఆటగాళ్లు కళకళలాడుతున్నారు. ప్రపంచ కప్ లో భాగంగా అందరు రెండు రకాల జర్సీలతో రావాలని ఐసీసీ చెప్పడంతో బీసీసీఐ మెన్ ఇన్ బ్లూ మరియు మెన్ ఇన్ శాఫ్రాన్ అంటూ రెండు రకాల జర్సీలతో ఇంగ్లాండ్ వెళ్ళింది. ఇప్పటివరకు మెన్ ఇన్ బ్లూ తోనే ఆడినా, తాజాగా మెన్ ఇన్ శాఫ్రాన్ లో ఫోటోలు విడుదల చేసింది బీసీసీఐ.
భారత ఆటగాళ్లు వరల్డ్కప్లో ఇంగ్లండ్తో జరగనున్న మ్యాచ్లో ఆరెంజ్ జెర్సీలో కనిపించనున్నారు. ఆ జెర్సీ వేసుకున్న కోహ్లీ సేన ఫోటోలు రిలీజ్ అయ్యాయి. వరల్డ్కప్ ట్విట్టర్లో ఆ ప్లేయర్ల ఫోటోలను పోస్టు చేశారు. ఆరెంజ్ జెర్సీలో టీమిండియా ప్లేయర్లు డిఫరెంట్గా కనిపిస్తున్నారు.