కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎంతో మందికి సహాయం చేసి దేవుడు అయ్యాడు. ఆ కష్ట కాలంలో సోనూ సూద్ చేసిని సహాయం మరువలేనిది. ఎందరో వలస కార్మికులను ఇల్లకు చేర్చారు. విదేశాలలో చిక్కుపోయిన వారిని స్వదేశానికి రప్పించారు. ఇలా లాక్డౌన్ సమయంలో మొదలు పెట్టిన సహాయాన్ని సోనూసూర్ కొనసాగిస్తూనే ఉన్నారు. సహాయం కోరుతు తన వద్దకు చేరిన వారికి లేదనకుండా చేయూతనిస్తున్నారు. అయితే తాజాగా నటుడు సోనూసూద్ పేరుతో మోసాలు బయట పడ్డాయి. సోను సూద్ కార్పొరేట్ కార్యాలయం పేరును వాడుకుని పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడ్డాడు. ట్విట్టర్లో సోనూసూద్ కార్పొరేట్ సంస్థ పేరుతో.. ఆశిష్ కుమార్ అనే వ్యక్తి అకౌంట్ క్రియేట్ చేసాడు. ఆ తర్వాత… ఆశిష్ కుమార్ అకౌంట్ కు పెద్ద ఎత్తున బాధితుల విన్నపాలు వచ్చాయి. తమకు సాయం చేయాలని ఆశిస్తూ బాధితులు రిక్వెస్ట్ పెట్టారు. దీంతో సోనూ సూద్ పేరు చెప్పి ఆశిష్ డబ్బులు వసూలు చేశాడు. అయితే.. ఈ కథ అడ్డం తిరగడంతో ఆశిష్ ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు.
next post
తిని కూర్చొని బరువు పెరగడం లేదు : నిత్యామీనన్