తెలంగాణాలో పెళ్లిళ్లు చేసుకుంటే ప్రభుత్వం నుంచి “కళ్యాణ లక్ష్మీ” పథకం అందుతోంది. అయితే ఆ దేశంలో మాత్రం పెళ్లిళ్లు చేసుకునే మహిళలకు ఏకంగా నెలనెలా జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ దేశమే కువైట్… అయితే ఈ జీతం పొందాలంటే మాత్రం కొన్ని షరతులు తప్పనిసరి. అవేంటంటే… ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్న మహిళలు, కంపెనీలు, ఇన్స్టిట్యూట్లూ స్థాపించిన మహిళలు దీనికి అనర్హులు. ఈ జీతం పొందే మహిళలు ఇంట్లో పనుల్లో సాయం చేయడానికి పనిమనిషిని పెట్టుకోవచ్చు. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ పనిమనిషిగా మగవారిని తీసుకోకూడదు. ఈ ఉచిత జీతం పథకం వల్ల కుటుంబ బంధాలు బలోపేతం అవుతాయని, దీని వల్ల కువైట్లో రోజురోజుకూ పెరుగుతున్న విడాకుల కేసులను తగ్గించడానికి, స్త్రీలు పిల్లల పోషణ, వారి ఎదుగుదలపై దృష్టి పెట్టడానికి వీలు కల్పించినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.