తాగు నీటి కోసం ఆరు దశాబ్ధాలుగా వేచి చూస్తున్న భాగ్యనగరానికి దాహర్తి తీర్చేందుకు కాళేశ్వరం ను నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహాన్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కలిసి ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ వలన వేల ఎకరాలు సశ్యశ్యామలం కానున్నాయి. ఇంతటి మహోజ్వల ఘట్టానికి స్పూర్తి ప్రదాత అయిన, అపర భగీరధుడు, తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ విషయంపై సూపర్ స్టార్ మహేష్ స్పందిస్తూ “‘ విప్లవాత్మక అద్భుతం.. తెలంగాణ ప్రజలు గర్వంగా భావించే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, కేటీఆర్ కు శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించిన ఇంజనీర్లకు హ్యాట్సాఫ్” అంటూ ట్వీట్ ద్వారా ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమంటూ నాగార్జున, రవితేజ వంటి స్టార్ హీరోలు కూడా తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.
previous post
next post