నడిఘర్ సంఘానికి 2019 – 2022 ఏడాదికిగానూ రానున్న 23వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విశాల్ పాండవర్ జట్టు, కే.భాగ్యరాజ్ స్వామిశంకరదాస్ జట్టు బరిలోకి దిగుతున్నాయి. రెండు జట్ల నుంచి జోరుగా ప్రచారం కూడా సాగింది. అయితే ఇటీవల ఈ ఎన్నికలు రద్దైన విషయం తెలిసిందే. నడిగర్ సంఘం ఎన్నికలను నిలిపివేయాలని తమిళనాడులో ఓ అధికారి మద్రాస్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పాండవర్ జట్టు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం నాడు ఈ రిట్ పిటిషన్ పై విచారణ జరపగా.. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరిగేలా తీర్పు వెల్లడించింది. అయితే ఎన్నికలు ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు జరపరాదని షరతు విధించింది. కోర్టు ఆదేశాలతో పాండవర్ జట్టు హర్షం వ్యక్తం చేసింది. దీంతో నడిఘర్ ఎన్నికలకు అడ్డు తొలగిపోయింది.
previous post