నేడు ప్రపంచ కప్ లో భాగంగా భారత్-పాక్ లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు కూడా వర్షం అడ్డం వచ్చేట్టుగానే ఉంది. అయినా చివరిదాకా ఆశ చావక, మ్యాచ్ పై అనేక విషయాలు చర్చిస్తున్నారు. అందులో ఒకటి చెప్పాలంటే, కోహ్లీ కొత్త రికార్డు. నిజానికి, విశ్వ వేదికలపై పాక్పై భారత్కు అజేయ రికార్డు ఉంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వికెట్ ఫాస్ట్ బౌలర్లు, బ్యాట్స్మెన్కు అనుకూలంగా ఉండటంతో పరుగుల వరద ఖాయమని తెలుస్తోంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో మరో మైలురాయికి దగ్గర్లో ఉన్నాడు.
పాక్తో మ్యాచ్లో కింగ్ కోహ్లీ 57 రన్స్ చేస్తే వన్డేల్లో 11వేల పరుగులు పూర్తిచేసిన తొమ్మిదో ఆటగాడిగా అతడు అరుదైన ఘనత అందుకోనున్నాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్లో 11వేల మార్క్ అందుకున్నాడు. ఐతే కోహ్లీ ఇప్పటి వరకు కేవలం 221 ఇన్నింగ్స్లు మాత్రమే ఆడటం విశేషం. అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో అత్యంత వేగంగా రికార్డును విరాట్ బ్రేక్ చేయబోతుండటం విశేషం. పాక్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని కోహ్లీ భారీ ఇన్నింగ్స్తో చెలరేగితే భారత్కు విజయంతో పాటు సరికొత్త రికార్డు తనపేరిట లిఖించుకోనున్నాడు.