వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేపై ట్విటర్ వేదికగా స్పందించారు. విజయసాయిరెడ్డి ఏమన్నారంటే.. చంద్రబాబు విదిల్చే కాంట్రాక్టులు, బుకీస్ ఇచ్చే కమిషన్లపై రోజులు వెళ్లదీస్తున్నాడు లగడపాటి. భీమవరం, విజయవాడ కేంద్రాలుగా బెట్టింగ్ ఆడేవారు 90% ఫ్యాన్ గెలుస్తుందని పెట్టారట. బుకీలు వేల కోట్లు నష్టపోయేట్టున్నారు.
లగడపాటి – కిరసనాయిలు ఇద్దరూ కలిసి బాబు కోసం, బుకీల కోసం ఆడుతున్న డ్రామా. అని వ్యాఖ్యానించారు. తెలంగాణా పోలీసులు గాలిస్తున్న క్రిమినల్స్ అంతా అమరావతిలో తలదాచుకుంటున్నారు. ఇంతకూ అక్కడ పోలీసు వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మారిపోయారా? లుకౌట్ నోటీసులు జారీ అయిన నిందితులు ఇక్కడ తలదాచుకుంటే పట్టుకుని అప్పగించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.