హైదరాబాద్కు చెందిన ఎన్నారై వికారాబాద్లో జరిగిన మౌంటైన్ బైక్ రేసింగ్లో ప్రాణాలు కోల్పోయాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయినా కూడా ఆలస్యంగానే విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఉంటున్న హైదరాబాద్కు చెందిన అరవింద్ ఇటీవల నగరానికి వచ్చాడు.
స్నేహితులతో కలిసి వికారాబాద్ జిల్లా గోధుమగూడ సమీపంలోని ఓ రిసార్టులో మౌంటైన్ బైక్ రేసింగ్కు వెళ్లాడు. రేసింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.