తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3, 2021 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించగా… ఆ ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది.
మొత్తం 4.59 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయగా 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించారు. ఇందులో బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.
ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు. మార్కుల మెమోలను 17వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కాగా కరోనా నేపథ్యంలో గత ఏడాది పరీక్షలు లేకుండానే ఫస్టియర్ విద్యార్థులను ప్రభుత్వం సెకండియర్కు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. గత నెలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. మొత్తంగా 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు.