సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా ‘మహర్షి’ రూపొందింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిల్రాజు, ప్రసాద్ వి పొట్లూరి, అశ్వినీదత్ నిర్మాతలుగా వ్యవహరించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. మహేష్ నటన, కథ, వంశీ టేకింగ్ అద్భుతంగా ఉన్నాయని చిత్రం టీమ్ ని ప్రముఖులతోపాటు విమర్శకులు కూడా ప్రశంసించారు.
ఇంతటి విజయాన్ని అందించిన దర్శకుడు వంశీపైడిపల్లిని ముద్దు పెట్టుకుని మరీ అభినందించారు సూపర్స్టార్ మహేష్ బాబు. ఈ ఫోటోను వంశీ పైడిపల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి “ఇది నా బెస్ట్ మూమెంట్. ఇంతకు మించి ఇంకేమి అడగగలను” అంటూ కామెంట్ చేశారు. ఈ సినిమా అటు వంశీతోపాటు ఇటు మహేష్ కెరీర్లోనూ ఉత్తమంగా నిలిచింది. రైతులకు అండగా సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
కాగా మహేష్ మరోసారి హాలీడే ట్రిప్ వెళ్లాలని అనుకుంటున్నాడట. ఇప్పుడు మహర్షి రిజల్ట్పై మహేష్ చాలా హ్యాపీగా ఉన్నాడు. నెక్ట్స్ మూవీ అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేయాల్సి ఉంది. దానికి ఇంకాస్త సమయం ఉండటంతో.. మహేష్ మరోసారి సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేశాడట. మరుసటి వారం మహేష్ ట్రిప్లో భాగంగా విదేశాలకు వెళతాడని సమాచారం. ట్రిప్ నుండి రాగానే అనీల్ సినిమాలో జాయిన్ అవుతాడట. మహేష్ ఇటీవల ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి సెటైరికల్ పోస్ట్