ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రెండు బిల్లులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.రాష్ట్రంలో ఓడ రేవుల సత్వరాభివృద్ధి, ఏపీ సముద్ర తీరప్రాంత బోర్డు బిల్లు-2018ను రాష్ట్రపతి ఆమోదించారు. అలాగేఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ బిల్లు- 2018ను కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.
తీవ్ర అపరాధం కేసుల్లో బెయిల్ పొందిన వ్యక్తిని న్యాయస్థానం నిర్ణయించిన తేదీన హాజరు పర్చడంలో హామీదారుడు విఫలమైన సందర్భాల్లో జరిమానా విధించేలా ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రథమ కార్యదర్శి ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి ఎం.విజయరాజుకు లేఖ రాశారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ జారీ చేసిన ప్రతులను ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ప్రకాష్ మీడియాకు విడుదల చేశారు.
హత్యలకు బీహార్ కేంద్రంగా మారింది: గులాం నబీ అజాద్