తమిళ చిత్రం “రాంగీ” షూటింగ్ సమయంలో స్పృహ కోల్పోయిన త్రిష ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోందని వచ్చిన పుకార్లను ఆమె తల్లి ఉమ కొట్టిపారేసింది. కోలీవుడ్లో సుమారు 15 సంవత్సరాలుగా హీరోయిన్ గా రాణిస్తున్న నటి త్రిష కొంతకాలం గ్యాప్ తరువాత హీరోయిన్ ఓరియెంటెండ్ చిత్రాలను ఎంచుకుని నటిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతితో ఆమె నటించిన ‘96’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఏఆర్ మురుగదాస్ అందించిన కథ “రాంగీ” చిత్రంలో త్రిష హీరోయిన్ ఓరియెంటెండ్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి మురుగదాస్ శిష్యుడు శరవణన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. గత రెండు రోజుల క్రితం చిత్ర షూటింగ్లో పాల్గొన్న త్రిష హాఠాత్తుగా స్పృహ కోల్పోయి పడిపోయిందని, ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్సలందిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ వార్తలను త్రిష తల్లి ఉమాకృష్ణన్ ఖండించారు. ప్రస్తుతం త్రిష ఆరోగ్యంగానే వుందని, “రాంగీ” చిత్ర షూటింగ్లో బిజీగా పనిచేస్తోందని ఆమె తెలిపారు.
previous post
“రంగస్థలం” మిస్సయినందుకు బాధగా ఉంది : అనుపమ పరమేశ్వరన్