telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్ బాబుకు, పూరీకి విభేదాలు ?

Mahesh Babu

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు, దర్శకుడు పూరీ జగన్నాథ్ కు మధ్య విభేదాలా? అనే విషయం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు కారణం కూడా ఉంది. మహేశ్ నటించిన “పోకిరి” సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పూరీ, ఆ తరువాత “బిజినెస్ మేన్”తో మరో హిట్ నూ మహేశ్ కు అందించాడు. ఇక తాజాగా మహేశ్ 25వ చిత్రం “మహర్షి” ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన ప్రిన్స్, తనకు సక్సెస్‌ ఇచ్చిన ఒక్కో దర్శకుడికి పేరును చెబుతూ వారికి కృతజ్ఞతలు చెప్పాడు. తన తొలి చిత్రం ‘రాజకుమారుడు’ దర్శకుడు రాఘవేంద్రరావు నుంచి మలి చిత్ర దర్శకుడు కొరటాల శివ వరకూ అందరి పేర్లనూ చెప్పిన ఆయన, పూరీ జగన్నాథ్ పేరును మాత్రం చెప్పలేదు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్ లో ‘జనగణమన’ అనే సినిమా చాలా నెలల క్రితమే అనౌన్స్ అయినప్పటికీ, పట్టాలు ఎక్కలేదు. ఈ సినిమా విషయంలోనే ఇద్దరి మధ్యా దూరం పెరిగిందన్న వార్తలూ వచ్చాయి. దీంతో మహేశ్ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా పూరికి థ్యాంక్స్‌ చెప్పాడు.

Related posts