ఢిల్లీలో లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. ఆప్ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించింది. దీని తో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని ఆమ్ ఆద్మీ చెప్పింది.
కాంగ్రెస్కు మూడు సీట్లు ఇవ్వడం అంటే, ఆ సీట్లను బిజెపికి సమర్పించినట్లు అవుతుందని డిప్యూటి సియం మనీష్ పిసోడియా తెలిపారు. ఢిల్లీలో 4-3 సీట్ల చొప్పున పోటీ చేద్దామని కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ను ఆమ్ ఆద్మీ తిరస్కరించింది.