హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇద్దరని పోలీసులు అరెస్ట్ చేశారు. జీహెచ్ఎంసీ చెత్త డంపింగ్ లారీ డ్రైవర్ రాజు, గుప్తా అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి నిందితులను రిమాండ్కు తరలించాలని పోలీసులను ఆదేశించారు. ఈ కేసులో మరో ఇద్దరు జీహెచ్ఎంసీ ఉద్యోగులు పరారీలో ఉన్నారు.
పంజాగుట్ట చౌరస్తాలో సెంట్రల్ షాపింగ్ మాల్కు ఎదురుగా మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి సమీపంలో జై భీమ్ సొసైటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ 9 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాయి. సాయంత్రానికే ఆ విగ్రహం ధ్వంసమైన స్థితిలో జవహర్ నగర్ డంపింగ్ యార్డులో ప్రత్యక్షమైంది. దీనిపై ఎస్సీ, ఎస్టీ సంఘాలు, ప్రజాస్వామిక వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనుమానం అవసరం లేదు.. నూటికి వెయ్యిశాతం టీడీపీ గెలుస్తుంది: చంద్రబాబు