telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ నేతపై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి

voilance jummalamadugu ycp tdp

నెల్లూరు జిల్లాలో ఎన్నికల గొడవలు ఇంకా తగ్గలేదు. ఆదివారం జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయలేదనే కారణంతో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడిని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తిరుమల నాయుడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతన్ని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts