నెల్లూరు జిల్లాలో ఎన్నికల గొడవలు ఇంకా తగ్గలేదు. ఆదివారం జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయలేదనే కారణంతో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడిని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తిరుమల నాయుడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతన్ని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఎక్కడ స్కామ్ ఉంటే అక్కడ నిలుస్తావు.. పీవీపీపై బండ్ల గణేశ్ విమర్శలు