ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వినియోగంపై తీసుకున్న కీలక నిర్ణయాన్ని హీరో మంచు మనోజ్ మనస్ఫూర్తిగా ప్రశంసించారు.
13 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన చొరవను మనోజ్ స్వాగతించారు.
ఒక తండ్రిగా తన బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఈ నిర్ణయం నేటి తరం పిల్లల మానసిక ఆరోగ్యానికి మరియు భద్రతకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇంతటి సాహసోపేతమైన, నిర్మాణాత్మకమైన నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రికి తన కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

