‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ఏర్పాటు చేసి భరత మాత దాస్య శృంఖలాలను తెంచేందుకు నిర్విరామ కృషి చేసిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు 129వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.
ఆయన పోరాట పటిమ దేశ పౌరుషానికి ప్రతీకగా ఈనాటికీ చెప్పుకుంటున్నామంటే అది ఆయన ప్రత్యేకత. భారత జాతి కోసం ప్రాణాలకు తెగించి పోరాడతానని ప్రతిజ్ఞ చేసి కార్యాచరణలో చూపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు ప్రాత:స్మరణీయుడు అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు.

