telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు ప్రధాని మోదీతో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ భేటీ

biswabhusan harichandan governor

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో భేటీకానున్నారు. నిన్న రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన గవర్నర్‌ ఈరోజు ప్రధానితోపాటు హోంమంత్రి అమిత్‌ షా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులను కలవనున్నారు.

మోదీతో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించనున్నారు. 12.20 గంటలకు అమిత్‌ షాతో భేటీ అవుతారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాలు, అధికార పక్షంపై విపక్ష టీడీపీ ఫిర్యాదులను ఆయన వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. సాయంత్రం 5.30 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సమావేశమవుతారు. శనివారం గవర్నర్ తిరిగి అమరావతి చేరుకుంటారు.

Related posts