ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలోని సరయూ నదిలో స్నానం చేస్తున్న భార్యాభర్తలు పై పలువురు వ్యక్తులు దాడి చేశారు.
రాముడి జన్మభూమిమైన అయోధ్య ఒడ్డున ప్రవహించే పవిత్ర నదిలో స్నానం చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి తన భార్యను కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడంఅసభ్యకరంగా ప్రవర్తించాడు.
దీంతో ఆగ్రహించిన పలువురు వ్యక్తులు నదిలో స్నానం చేస్తుండగా భార్యాభర్తలను నదిలో నుంచి బయటకు లాగి భర్తపై దాడిచేశారు.
అయోధ్యలో ఇలాంటి అసభ్యతను సహించబోమంటూ బాధిత వ్యక్తికి హెచ్చరికలు చేశారు. భర్తకు రక్షణగా నిలబడేందుకు భార్య ప్రయత్నించింది. దంపతులిద్దరినీ నీళ్లలోంచి ఒడ్డుకు పంపించారు
కాగా ..బహిరంగ ప్రదేశంలో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు యాక్టివ్ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాల్సిందిగా అయోధ్య పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. కొత్వాలి అయోధ్య పోలిస్ స్టేషన్ ఇన్చార్జి ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.
గంగా నది ఉపనదుల్లో సరయూ నది ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్రమైనదిగా విశ్వసిస్తారు. రాముడి జన్మభూమి అయోధ్య ఈ నది తీరాన ఉన్న విషయం తెలిసిందే .
अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें: pic.twitter.com/hG0Y4X3wvO
— Suneet Singh (@Suneet30singh) June 22, 2022