రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఆదిబట్ల కుర్మల్గూడ చెరువులో దూకి ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు..ఈ ఘటన నాదర్గుల్ పరిధిలోని కూర్మల్గూడలో జరిగింది. మృతులు కుద్దుస్ పాషా (37), ఫాతిమా (28), మెహర్ (9), ఫిర్దోషు భేగం(6)గా గుర్తించారు.
వీరి కుటుంబం హైదరాబాద్లోని సంతోశ్నగర్లో ఉంటున్నట్లు తెలిపారు.కుటుంబంతో కలిసి కుద్దుస్ పాషా నిన్న కుర్మల్గూడకు వచ్చాడు. గత రాత్రి పురుగుల మందుతాగి చెరువులో దూకినట్లు సమాచారం. స్థానికులు కుద్దుస్ పాషా, ఆయన కుమార్తెను బయటికి తీయగా వారు అప్పటికే మృతిచెందారు. ఉదయం తల్లి, మరో బిడ్డ మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
అప్పుల బాధతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. కుద్దుస్ పాషా ఓ వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.