వరంగల్ లోని నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన అనూష అనే విద్యార్ధినిపై ప్రేమోన్మాది దాడి ఘటనపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై విచారం వ్యక్తం చేశారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో బాధితురాలు చికిత్స పొందుతుంది . అనూష ఆరోగ్య పరిస్థితిని హాస్పిటల్ సూపరిటెండెంట్ తో గవర్నర్ ఫోన్ లో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు.
యువతికి మెరుగైన వైద్యం అందించాలని గవర్నర్ అధికారులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని తమిళిసై అన్నారు.