తెలంగాణలో సోమవారం జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి విడుతలో భాగంగా 3701 పంచాయతీలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. తొలి విడుతలో వివిధ కారణాలతో మూడుచోట్ల రీపోలింగ్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
వరంగల్ రూరల్ జిల్లా పార్వతగిరి మండలం ముంజలకుంట్ల తండా, జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామ పంచాయతీలకు, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం సోమాన్పల్లి గ్రామ పంచాయతీలోని 8 వార్డుకు ఈనెల 30వ తేదీన రీ-పోలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది.
హామీలను అమలు చేయకుండా వైసీపీ మాట మారుస్తోంది: లోకేశ్