ఉమ్మడి అనంతపురం జిల్లాలో ని సత్యసాయిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతుంది.
పంటలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జనసేన కౌలు రైతు భరోసా యాత్ర నేడు ప్రారంభించారు.
రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్కు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
కొత్తచెరువు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
బీజేపీలో కలిసిపోవాల్సిందే అంటున్నాడు తుగ్లక్: బుద్ధా వెంకన్న