ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్తో పాటు సినీ సెలెబ్రిటీస్ సోషల్ మీడియాలో వేదికగా విషెస్ తెలుపుతున్నారు.
తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన, ప్రోత్సాహమిచ్చిన వారందరికీ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలుపుతూ.. భావోద్వేగ లేఖలను పోస్ట్ చేశారు .ప్రస్తుతం ఆ లేఖ వైరల్ అవుతోంది.
‘‘నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, గురువులు, శ్రేయోభిలాషులు, చిత్ర పరిశ్రమ వారు, సినీ ప్రేక్షకులు, అభిమానులందరి అందరికీ నమస్కారం.
మీ ప్రేమ, ఆశీస్సుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. నేను చాలా అదృష్టవంతుడిని అన్నారు. నాకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల నుంచి నా కుటుంబం, నా స్నేహితులు అందరూ నా ఎదుగుదలకు కృషి చేశారు. ముఖ్యంగా నా అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నాను.
40 ఏళ్లు వెనక్కి తిరిగి చూస్తే ఏదో తెలియని ఫీలింగ్. మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రయాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని పేర్కొన్నారు.
1982 ఏప్రిల్ 8న జన్మించిన అర్జున్.. ‘విజేత’, ‘స్వాతిముత్యం’ చిత్రాల్లో బాల నటుడిగా అలరించి ‘గంగోత్రి’తో హీరోగా మారారు. ‘ఆర్య’తో మంచి గుర్తింపు పొందారు. ‘బన్నీ’, ‘హ్యాపీ’, ‘దేశముదురు’, ‘వేదం’, ‘జులాయి’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ‘అల వైకుంఠపురములో’ తదితర సినిమాలతో విశేష క్రేజ్ సంపాదించారు. ‘పుష్ప: ది రైజ్’తో పాన్ ఇండియా హీరోగా అవతరించారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబరులో విడుదలై రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం.. అర్జున్ ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’ పనుల్లో బీజీగా ఉన్నారు. పుష్ప 2 షూటింగ్ మూడు నాలుగు నెలల్లో స్టార్ట్ అవుతుందని సినీ వర్గాలు సమాచారం.
ఆ సినిమా కథ విని దర్శకుడిని తిట్టేశా.. : సంగీత