telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ కేసు : జూన్ 13న సుశాంత్ తోనే రియా… స్టింగ్ ఆపరేషన్ లో సంచలనం

Sushanth

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ జాతీయ మీడియా ఛానల్ జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ మేరకు సుశాంత్ మరణానికి ముందు ఆయన ఇంట్లో పార్టీ జరిగిందనే విషయంపై ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ విచారంలో భాగంగా పలు విషయాలపై స్పందించిన రియా… లాక్‌డౌన్‌లో సుశాంత్ ఇంట్లోనే సహజీవనం చేసినట్లు స్వయంగా వెల్లడించింది. అయితే సుశాంత్ మరణానికి ముుందు జూన్ 8వ తేదీన తాను ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చానని, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తనకు తెలియదని చెప్పింది. ఈ తరుణంలో ఇటీవల ఓ జాతీయ మీడియా స్ట్రింగ్ ఆపరేషన్‌లో జూన్ 13న రాత్రి రియాను సుశాంత్ డ్రాప్ చేశారనే విషయం బయటపడినట్లు టాక్. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షి వెల్లడించాడని తెలుస్తుండటం మరిన్ని అనుమానాలకు తెరలేపింది. జూన్ 13న అర్ధరాత్రి 12 గంటల సమయంలో రియా చక్రవర్తి, సుశాంత్ కలిసి ఉండటాన్ని తాను స్వయంగా చూసినట్లుగా ఆ ప్రత్యక్ష సాక్షి వెల్లడించాడని సమాచారం. మరోవైపు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఎయిమ్స్ రిపోర్ట్‌ స్వీకరించిన సీబీఐ అధికారులు దర్యాప్తులో వేగం పెంచేశారు. ఈ మేరకు సుశాంత్ కేసులో ఐపీసీ ప్రకారం 302 సెక్షన్‌ను విధించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు అదనంగా ఈ సెక్షన్‌ను జోడించనున్నారని తెలుస్తోంది. జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రాలో తన ఇంట్లోనే ఫ్యాన్‌కి ఉరి పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు సుశాంత్. గత 6 నెలలుగా డిప్రెషన్‌లో ఉండి ఆ కారణం గానే సుశాంత్ బలవన్మరణానికి ఒడిగట్టారని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. కానీ సుశాంత్ సన్నిహితులు ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడంతో సీబీఐ రంగంలోకి విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ ప్రేయసి రియాను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts