telugu navyamedia
సినిమా వార్తలు

పర్సనల్ గా ఫ్రస్టేషన్ లో ఉండేవాళ్ళే అలా కామెంట్స్ చేస్తారు : హీరోయిన్

Disha-Patani

సాధారణంగా నెటిజన్లకు సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న విషయం దొరికినా ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ బారిన పడేవారిలో నటి దిశా పటాని కూడా ఒకరు. ఆమె ఓ ఇన్నర్ గార్మెంట్స్ కంపనీకి బ్రాండ్ అంబాసిడర్ కావడంతో తరచూ లోదుస్తులు వేసుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతుంటుంది. చాలా మంది దిశాని ఈ విషయంలో ట్రోల్ చేస్తుంటారు. తాజాగా తనపై జరుగుతోన్న ట్రోలింగ్ పై స్పందించింది ఈ హాట్ బ్యూటీ. ఆన్ లైన్ లో చాలా మంది తమ లైఫ్ లో హ్యాపీగా లేని వాళ్లు ఫ్రస్ట్రేషన్ తో అటువంటి కామెంట్స్ చేస్తుంటారని, వాటిని పెద్దగా పట్టించుకోనని కేవలం పాజిటివ్ విషయాల మీదనే దృష్టి పెడతానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ‘భారత్’ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Related posts