మెగా మేనల్లుడు యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఆ తరువాత వచ్చిన ‘కొండపొలం’ పెద్దగా విజయం సాధించలేకపోయింది.
తాజాగా తన మూడో సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. గిరీశాయ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్కు ఫిక్స్ చేశారు. ఈ మేరకు సోమవారం(జనవరి 24) టైటిల్ టీజర్ను కూడా వదిలారు.
ఏంటే ట్రీట్ ఇస్తాను అని చెప్పి ఊపుకుంటూ వస్తున్నావు అంటూ హీరో అంటాడు..అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు తెలుసా అని హీరోయిన్ అంటుంది..అంటే బాగా ప్రిపైర్డ్గా వచ్చినట్టున్నావు అని హీరో అంటాడు…
‘నీకు బటర్ఫ్లై కిస్ తెలుసా?’ అని హీరోయిన్, హీరోను అడిగి అతడికి ముద్దు పెడుతుంది. ‘ఎలా ఉంది?’ అని మళ్లీ ఆమె అడగ్గా.. నెక్స్ట్ లెవల్లో ఉంది వైష్ణవ్తేజ్ చెబుతున్న డైలాగ్తో టీజర్ పూర్తైంది . ఈ సీన్ చూస్తే సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్గా పని చేయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.