దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. సామాన్యులనుంచి సెలబ్రెటీల వరకు అందరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో మంచు మనోజ్, మంచు లక్ష్మీ , మహేష్ బాబు, కీర్తిసురేష్, రాజేంద్ర ప్రసాద్, నవీన్ పోలిశెట్టి, బండ్లగణేష్, తమన్ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు హీరోయిన్ త్రిష కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే .
తాజాగా ఆమె ఓ బ్యూటిఫుల్ పిక్ తో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది త్రిష. “ఇప్పుడు నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను 2022” అంటూ ఈ పిక్ ను పోస్ట్ చేసింది త్రిష. అలాగే ‘నెగిటివ్’ అనే పదం చదివినప్పటికీ సంతోషంగా లేనంటూ.. కానీ కరోనానను మాత్రం జయించానని త్రిష ట్వీట్ చేసింది.
వీళ్లకు అసలు సిగ్గు, శరం లాంటివి ఏమైనా ఉన్నాయా?… కత్తి మహేష్ పై మాధవీలత ఫైర్