telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బెంజ్ కారు కొన్న సీనియర్ యాంకర్… పిక్ వైరల్

Udayabhanu

సీనియర్ యాంకర్ ఉదయభాను తాజాగా ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేశారు. ఈ మేరకు తన ఇద్దరు పిల్లలు, భర్తతో కారు డెలివరీ సమయంలో తీసుకున్న ఫొటో తాజాగా బయటికి వచ్చింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పుడు ఆమె కోసం కుర్రాళ్లు పడి చచ్చిపోయేవారు. ‘వన్స్ మోర్ ప్లీజ్’, ‘సాహసం చేయరా డింభకా’, ‘డాన్స్ బేబీ డాన్స్’, ‘పిల్లలు పిడుగులు’ లాంటి ఎన్నో టీవీ కార్యక్రమాలతో ఆమె మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. సినిమాల్లో కూడా మెరిశారు. కెరీర్ మంచి పీక్‌లో ఉన్న సమయంలో అంటే 2004లో విజయ్ కుమార్‌ను ఉదయభాను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరవాత కూడా తన ప్రొఫెషన్‌ను కొనసాగించారు. అయితే, 2016 ఆగస్టులో ఉదయభాను కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు. పిల్లలు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర పుట్టిన తరవాత ఉదయభాను పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారు. సుధీర్ఘ విరామం తరవాత ఇటీవల మళ్లీ బుల్లితెరపై ఆమె రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఉదయభాను ఫుల్ బిజీగా ఉన్నారు. రియాలిటీ గేమ్ షో ‘కళ్యాణ లక్ష్మి’కి వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. అలాగే, శ్రీముఖి హోస్ట్ చేస్తున్న కామెడీ షో ‘జూలకటక’కు జడ్జిగానూ కొనసాగుతున్నారు. అలాగే, మూవీ ఈవెంట్‌లు కూడా చేయడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు.

Related posts