telugu navyamedia
సినిమా వార్తలు

బ్యూటిఫుల్ పిక్ తో గుడ్ న్యూస్ చెప్పిన త్రిష‌

దేశంలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. సామాన్యులనుంచి సెలబ్రెటీల వరకు అందరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో మంచు మ‌నోజ్‌, మంచు ల‌క్ష్మీ , మహేష్ బాబు, కీర్తిసురేష్, రాజేంద్ర ప్రసాద్, నవీన్ పోలిశెట్టి, బండ్లగణేష్, తమన్ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు హీరోయిన్‌ త్రిష కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే .

Image

తాజాగా ఆమె ఓ బ్యూటిఫుల్ పిక్ తో అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది త్రిష. “ఇప్పుడు నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను 2022” అంటూ ఈ పిక్ ను పోస్ట్ చేసింది త్రిష. అలాగే ‘నెగిటివ్‌’ అనే పదం చదివినప్పటికీ సంతోషంగా లేనంటూ.. కానీ కరోనానను మాత్రం జయించానని త్రిష ట్వీట్ చేసింది.

Related posts