హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికాల అంతిమయాత్ర కొనసాగుతుంది. ఢిల్లీ కామ్రాజ్ మార్గ్ లోని రావత్ నివాసం నుంచి వారి భౌతికకాయాలనుంచిన వాహనం ఢిల్లీ కంటోన్మెంట్లోని బ్రార్ స్క్వేర్లోని శ్మశానవాటికవరకు అంతిమ యాత్ర సాగనుంది.
ఆ తర్వాత సైనిక లాంఛనాలతో రావత్ దంపతుల అంత్యక్రియలు జరగనున్నాయి . అలాగే నేతలు, సైనికులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. దారిపొడవున ప్రజలు జెండాలతో వారికి సెల్యూట్ చేస్తున్నారు.
మరోవైపు రావత్ దంపతులకు వారి కుమార్తెలు కృతిక, తరణి నివాళులర్పించారు. తల్లిదండ్రుల భౌతికకాయాలపై పూల రేకులు జల్లి అంతిమ వీడ్కోలు పలికారు. తండ్రితో అనుబంధం, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.