యంగ్ హీరో నితి న్, నభా నటేశ్ జంటగా రూపొందిన చిత్రం ‘మాస్ట్రో ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా సెప్టెంబరు 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్. ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ చిత్రం ‘అందాధున్’ తెలుగు రీమేక్లో నితిన్ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
కరోనా భయంతో థియేటర్లకు ప్రేక్షకులు పెద్దంతగా రాకపోవడం, కరోనా భయాలు తొలగకపోవడం వల్ల అవి వాయిదా సినిమాలు వాయిదా పడుతున్నాయి. కానీ ఓటీటీలో సెప్టెంబర్ 9న స్ట్రీమింగ్ అవుతుందని చెప్పిన ‘మాస్ట్రో’ సినిమా సైతం సెప్టెంబర్ 17కు వాయిదా పడింది.
ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేశ్ తో పాటు జిషుసేన్ గుప్తా కీలక పాత్ర పోషించాడు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ మూవీకి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు. ‘మాస్ట్రో’ కోసం క్రేజీగా ఎదురుచూస్తున్న కుర్రకారు… నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానులు కాస్తంత నిరాశకు గురి కావడం ఖాయమనే చెప్పొచ్చు.