తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక నిన్న రాత్రి 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రుయా మృతలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు సిఎం జగన్. బాధిత కుటుంబాలకు అన్ని రకాల అండగా ఉంటామని సిఎం జగన్ హామీ ఇచ్చారు. అటు ఈ ఘటనతో ఆక్సిజన్ పై ఏపీ సర్కార్ మరింత ఫోకస్ పెట్టింది. ముగ్గురు సీనియర్ అధికారులకు ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది సర్కార్. తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలకు ముగ్గురు అధికారులను నియమించింది.
previous post
బడ్జెట్ లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదు: విజయసాయి రెడ్డి