telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధాని అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి: మాజీ మంత్రి పుల్లారావు

ఏపీ రాజధాని అంశంపై నేతలు విభిన్న ప్రకటనలు చేయడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని మార్పుపై పజ్రల్లో పలు అనుమానాలు నెలకొంటున్నాయని అన్నారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్‌ నాలుగు ప్రాంతాల్లో రాజధాని అన్న వ్యాఖ్య అనంతరం మరింత అయోమయం నెలకొందన్నారు.

రాజధాని అంశంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గౌతంరెడ్డి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో విస్పష్ట ప్రకటన చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పై ఉందన్నారు. రాజధాని విషయంలో ప్రజలను అయోమయానికి గురిచేయడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవుపలికారు.

Related posts