తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక నిన్న రాత్రి 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రుయా మృతలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు సిఎం జగన్. బాధిత కుటుంబాలకు అన్ని రకాల అండగా ఉంటామని సిఎం జగన్ హామీ ఇచ్చారు. అటు ఈ ఘటనతో ఆక్సిజన్ పై ఏపీ సర్కార్ మరింత ఫోకస్ పెట్టింది. ముగ్గురు సీనియర్ అధికారులకు ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది సర్కార్. తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలకు ముగ్గురు అధికారులను నియమించింది.
previous post
“లక్ష్మీస్ ఎన్టీఆర్”పై కళ్యాణ్ రామ్ కామెంట్