ప్రస్తుతం మన దేశంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలలో కారోబా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. అయితే కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొల్లిపర మండలంలో లాక్ డౌన్ విధించారు. కొల్లిపర మండలంలో వారం రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు తహసీల్దార్ పేర్కొన్నారు. ఏప్రిల్ 10 వ తేదీ నుంచి ఈనెల 16 వ తేదీ వరకు వారం రోజులపాటు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మాత్రమే వ్యాపారాలకు అనుమతులు ఇస్తున్నట్టు తహసీల్దార్ పేర్కొన్నారు. హోటల్స్, టీ స్టాల్స్ ను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇటీవలే భట్టిప్రోలు మండలంలో కూడా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే చూడాలి మరి ఈ లాక్ డాఎం ఆ మండలం వరకే మరిమితం అవుతుందా… లేక మెల్లిమెల్లిగా రాష్ట్రం మొత్తం అవుతుందా అనేది.
previous post