వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు టీడీపీ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబు, అచ్చెన్నపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు చంద్రన్నే సీఎం అని.. తర్వాత లోకేష్ సీఎం అవుతాడని.. ఇప్పుడు అచ్చెన్నాయుడు సీఎం అంటూ టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు భజన చేస్తున్నారని టీడీపీపై సెటైర్ వేశారు. “ఎక్కడ నుంచి తెస్తారు ఈ పెయిడ్ ఆర్టిస్టుల్ని? ఎన్నికల ముందు జయము జయము చంద్రన్నా అన్నారు…ఆ తర్వాత లోకేశుడే మాహీశుడన్నారు. ఇప్పుడు అక్కుం బక్కుం అచ్చెన్నే సీఎం అంటూ పాటలు పాడుతున్నారు. ప్రచారం చేయండంటే కామెడీ పండిస్తున్నారు పచ్చపార్టీ జోకర్లు. తిరుపతి ఉప ఎన్నికల్లో మాట్లాడడానికి పచ్చ కుల పార్టీకి ఒక్క సరైన అంశమైనా ఉందా? ఎక్కడెక్కడో అంశాలను లేవనెత్తి ప్రజల్ని గందరగోళం చేస్తున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడే దమ్ముందా? ఎప్పటిలానే కేసులు, కులాలు, మతలేనా మీ ప్రచార అంశాలు? ఇక అంతకు ముందు ట్వీట్లో “దిగ్గజ “ఘాజీ” విశ్లేషకుని పనైపోయింది. – పచ్చ కుల ఛానల్స్ కి రేటింగ్ రావడంలేదు. అసలు ఏ పార్టీలో ఉన్నాడో తెలియని మరో మేధావి బయలుదేరాడు. దమ్ముంటే ప్రజల్లోకెళ్లి పోరాడండి – విభజన సమస్యలపై ఒత్తిడి తెండి. ఈ బీ.కాం ఫిజిక్స్ సలహాలు మాకెందుకు – మీ pay మాస్టర్ చంద్రబాబుకిచ్చుకోండి.”అంటూ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.
previous post
next post