ఆంధ్ర ప్రదేశ్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో టీడీపీ సీనియర్ నేతల మధ్య వార్ నడుస్తోంది. కేశినేని నాని కుమార్తె శ్వేతను విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో నాని వ్యతిరేక వర్గం ఏకం అయింది. ఈ నేపథ్యంలోనే బోండా ఉమ, బుద్దా వెంకన్న కేశినాని నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఏకవచనంతో మాట్లాడిన నానిని ఆ రోజే చెప్పుతో కొట్టాలి అనుకున్నానని…రంగాను చంపిన కేసులో ముద్దాయిలను వెంట పెట్టుకుని నాని తిరుగుతున్నాడని నిప్పులు చెరిగారు బుద్దా వెంకన్న. రంగాను చంపిన కేసులో ముద్దాయిలను వేసుకుని ప్రచారానికి తిరుగుతారా… నానివి కులం పోకడలు..పార్టీకి నష్టమని పేర్కొన్నారు. మేము విజయసాయిరెడ్డి తో ఫైట్ చేస్తుంటే…. సాయిరెడ్డినే కేశినేని లంచ్ కి పిలుస్తాడా అని నిలదీశారు. తాను ఇకపై విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా ఉంటానని… 2024 లో తానే ఎంపీగా పోటీ చేస్తానని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. కేశినేని నాని రెండు కాళ్ళు ఇరగ్గొడతానని…తన వెనుక ఉన్న ఒక్క మనిషిని పంపితే చాలు….నాని పని అయిపోతుందని బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. నాని ఉంటే ఎన్నికల్లో పని చేయలేమని తెలిపారు.
next post
ట్రిపుల్ తలాక్ బిల్లుద్వారా మహిళలకు అన్యాయం: ఒవైసీ