ఇటివల కాలంలో మందు కొట్టి వాహనాలను నడుపుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో హైదరాబాద్ పరిధిలో సాయంత్రం నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. దీంతో అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలోనే ఈ తనిఖీలు ఉండటంతో… ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో వాహనదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు స్పందించారు. రాత్రి 9 గంటల్లోపు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు సరైన సమయం కాదని భావించిన ట్రాఫిక్ విభాగం.. ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9:30 గంటల తర్వాతనే డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మందుబాబులు కూడా 10 గంటల తరువాతనే రోడ్లపైకి వస్తారన్న అంచనాతోనే, అన్ని పోలీసు స్టేషన్ పరిధిలో రాత్రి 9:30 తరువాతే డ్రంకన్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించినట్లు ట్రాఫిక్ వర్గాలు తెలిపాయి.
మొన్నటి వరకు మోదీతో..ఇప్పుడు రాహుల్ జపం