యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30 సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వం లో చేస్తున్న విషయం తెలిసిందే . ఈ ప్రోజక్ట్ కు ‘అయినాను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ అదిరిపోయే కథను సిద్ధం చేసాడని తెలుస్తుంది. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్కు ఆయన స్టార్ ఇమేజ్కు తగ్గట్లుగా ఓ అదిరిపోయే క్యారెక్టర్ను రాసుకున్నాడట త్రివిక్రమ్. సంజయ్ దత్ ఈ సినిమాలో పక్కా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడట.ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ – నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ భామ వరీనా హుస్సేన్ ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు చాలా వస్తున్నాయి. అయితే ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల కారణంగా ఈ వార్త పుట్టుకొచ్చింది. ఈ వార్తపై ఇటీవల క్టారిటీ వచ్చింది. ఈ సినిమాలో వరీనా హుస్సేన్ నటించడం లేదంట. అయితే ఆమె ఎన్టీఆర్ ప్రొడక్షన్లో కళ్యాణ్ రామ్తో నటించనున్నారంట. అయితే ఈమె దబాంగ్-3 సినిమాలో సల్మాన్తో స్పెషల్ సాంగ్లో స్టెప్పులేసింది.
previous post
next post
కాజల్, అనుష్కలపై రెబల్ స్టార్ కామెంట్స్