కరోనా లాక్ డౌన్ తో కుంగిపోయిన ఆర్థిక వ్య్వస్థలను గాడిలో పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనలతో షాపులు తెరిచేందుకుషా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధంచిన జీవోను జారీ చేసింది. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా ఇతర అన్ని ప్రాంతాల్లో షాపులను తెరవచ్చని జీవోలో పేర్కొంది.
సంస్థలు, దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు తెరవచ్చు. మెడికల్ షాపులకు ఎక్కువ సేపు తెరిచి ఉంచడానికి అనుమతి.వస్త్ర, పాదరక్షలు, ఆభరణాల షాపులు తెరివరాదు.హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి లేదు. అయితే, టేక్ అవే, హోం డెలివరీలు చేసుకోవచ్చు.
నిర్వాహకులు, సిబ్బంది ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.పని చేసే సిబ్బంది చేతులను శానిటైజ్ చేసుకోవాలి. మాస్కులు కచ్చితంగా ధరించాలి.మొత్తం సిబ్బందిలో 50 శాతం మంది మాత్రమే పని చేయాలి.ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, లిఫ్టులు, వర్కింగ్, పార్కింగ్ ప్రదేశాలను ఉదయం, సాయంత్రం శానిటైజ్ చేయాలని జీవోలో స్పష్టం చేసింది.