telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ రోజు నుంచి సుశాంత్ తనను చంపేస్తారని భయపడేవాడు : సిద్ధార్థ్

sushanth

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదురుకొంటున్న రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షౌమిక్ చక్రవర్తిని డ్రగ్స్ వినియోగించారని నిర్ధారణ అవ్వడంతో ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో రియాను నిందితురాలుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. అయితే రియా బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. కానీ కోర్టు రియాకు బెయిల్ నిరాకరించి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. తాజాగా సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్ పితానిని సీబీఐ అధికారులు విచారించారు. కాగా విచారణలో అతడు కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. సుశాంత్ అతడి మేనేజర్ దిశ ఆత్మహత్య చేసుకున్న నాటి నుండి తరచు భయపడేవాడని సిద్ధార్థ్ తెలిపాడు. తనను ఎవరో చంపేస్తారు అని ఆందోళన చెందేవాడని వెల్లడించాడు. అంతేకాకుండా సుశాంత్ లాప్టాప్, హార్డుడ్రైవ్ లను అతడి ప్రేయసి రియా చక్రవర్తి తీసుకెళ్లిందని చెప్పాడు. వీటితో పాటు సిద్ధార్థ్ పలు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.

Related posts