telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఉట్నూర్ లో భారీ పేలుడు.. ముక్కలైన శరీర భాగాలు

bomb blasts in srikakulam district costs 7 lives

బైక్‌పై తీసుకువెళుతున్న పేలుడు పదార్థాలు పేలడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెండాడు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు క్రాస్ రోడ్డ వద్ద జరిగింది. పేలుడు తీవ్రత భారీగా ఉండడంతో చనిపోయిన వ్యక్తి శరీర భాగాలు ముక్కలు.. ముక్కలుగా పడిపోయాయి. పెట్రోల్ బంక్ సమీపంలోనే పేలుడు జరగడంతో అక్కడున్నవారంతా భయాందోళనలు చెందారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇద్దరు వ్యక్తులు గత కొన్ని రోజులుగా అడవి పందుల వేటను వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. నాటు బాంబుల ద్వారా పంట పొలాలకు వచ్చే అడవి పందులను వేటాడుతూ ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంద్రవెల్లి నుంచి బైక్‌పై వారు ఉట్నూరుకు వస్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడింది. వంటనే పేలుడు సంభవించడంతో బైక్ నడిపిన వ్యక్తి చనిపోయాడు. వెనుక ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts