అధికారంలోకి వస్తే లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తం… అని నేటి టీఆరెస్ పాలకులు గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ నీటి మీద రాతలా మారింది అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి బీజేపీ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. ఎన్నికల హామీ అమలు కాలేదు సరికదా… పంటల సాగు కోసం రైతులు తీసుకున్న రుణాల్ని ఐదు రోజుల్లో రెన్యువల్ చేయకుంటే చట్టపరమైన చర్యలు తప్పవంటూ కోర్టు ఖర్చుల్ని కూడా వారే చెల్లించాలని అన్నదాతలకు బ్యాంక్ అధికారుల నుంచి నోటీసులు వస్తున్నాయి. ఇది చాలక బ్యాంకులో క్రాప్ లోన్ ఉందంటూ పించన్లు, రైతు బంధు కూడా అపుతున్నారు. కొంతమంది రైతుల ఖాతాల నుంచి వడ్లు అమ్ముకున్న పైసల్ని కూడా ఇవ్వక లోన్ కింద జమ చేసుకున్నారు. పింఛన్, రైతు బంధు డబ్బుల్ని బాకీల కింద జమ చేసుకోవద్దని బ్యాంకులకు సర్కారు నుంచి స్పష్టంగా ఆదేశాలున్నప్పటికీ పట్టించుకునే దిక్కులేదు. ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలోని పరిస్థితులివి. ఇక రాష్ట్రం మొత్తం మీద పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. నిలదీసి ఏదైనా అడుగుదమంటే…. చట్టం తెలిసిన వకీళ్ళకే రక్షణ లేకపోయింది. మంథని తీరుగా హత్యలు కాబడుతున్నరు. గుర్రంపోడు లెక్క అన్యాయంపై కొట్లాడుదమంటే అరెస్టులు చేస్తున్నరు, కొట్టి కేసులు పెడుతున్నరన్న భయంతో తెలంగాణ సమాజం ఆందోళన చెందుతోంది.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు.
next post


నా గురించి దేవేగౌడ అసత్యాలు మాట్లాడారు: సిద్ధరామయ్య ఫైర్